ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


మాకవరంపాలెం (విశాఖపట్నం): అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విశాఖపట్నం జిల్లా మాకవరంపాలెం మండలం తామరం గ్రామస్తులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. తరచూ రేషన్ బియ్యాన్ని డీలర్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటుండటంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు అక్రమ రవాణా చేస్తున్న వారిని నిర్బంధించి సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top