రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
దుర్గి (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా దుర్గి మండలం ఓబుళాంపురం గ్రామంవద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో బైక్లపై ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దుర్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పిడుగురాళ్లకు చెందినవారు కాగా, మరో ఇద్దరు దుర్గికి చెందినవారు.