ఆటోను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు


విశాఖపట్నం : విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం లైను కొత్తూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని....క్షతగాత్రులను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కారులోని వారు ఎలమంచిలి నుంచి ఏటికొప్పాకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top