తిరుమలలో లడ్డు దళారులు అరెస్ట్
తిరుమల: తిరుమలలో ఐదుగురు లడ్డు దళారులను టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా లడ్డు టోకన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా పోలీసులు వారిని విచారిస్తున్నారు.
సంబంధిత వార్తలు