చిరస్మరణీయురాలు శోభా నాగిరెడ్డి
- వైఎస్ బాటలో నిత్యం ప్రజాసంక్షేమానికి కృషిన నేత
- ప్రథమ వర్ధంతి సభలో ఎమ్మెల్సీ బోస్ నివాళి
మండపేట : ప్రజా సంక్షేమం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో అనునిత్యం పాటుపడిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి చిరస్మరణీయురాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. స్థానిక కామత్ ఆర్కేడ్ వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బోస్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీ పటిష్టతకు పాటుపడుతున్న తరుణంలో ఆమె అకాల మరణం పార్టీకి తీరనిలోటన్నారు.
శోభా నాగిరెడ్డి కుటుంబంతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, పాపారాయుడు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు)లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటే ఉండి వైఎస్సార్ సీపీ బలోపేతానికి శోభా నాగిరెడ్డి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆమె లేని లోటును మరెవరూ పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత శోభా నాగిరెడ్డి చిత్రపటానికి బోస్, పాపారాయుడు, పట్టాభిరామయ్య చౌదరి, రాజుబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ పెట్టా శ్రీనివాస్, యువజన విభాగం రాష్ర్ట సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, అర్బన్, రూరల్ కన్వీనర్లు పోతంశెట్టి ప్రసాద్, వల్లూరి రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు తుపాకుల ప్రసన్నకుమార్, పీతా సూర్యావతి, నందికోళ్ల చిన్న, పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యభాస్కరరావు, పిల్లా వీరబాబు, కూసు అమ్మన్న, అన్నందేవుల శివకుమార్, గరగపాటి శ్రీనివాస్, గంగుమళ్ల రాంబాబు, కొప్పిరెడ్డి ప్రసాద్, కరెడ్ల అన్నవరం, శీలం గోవిందు, శీలం రాంబాబు, వెలగల సత్యన్నారాయణరెడ్డి, చిర్ల వీర్రెడ్డి, మట్టపర్తి గోవిందు, నేల సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.