విశాఖ అటవీ ప్రాంతంలో కాల్పులు


విశాఖపట్నం : విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్దనున్న అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. సుమారు 16 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇన్ని రౌండ్ల కాల్పులు జరిగినా ఎవరికీ గాయాలు కాకపోవడం గమనించదగ్గ విషయం. పోలీసులు మావోయిస్టుల ఆచూకీ కోసం సమీప అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top