మందుగుండు సామాగ్రి పేలి ఒకరు మృతి


విశాఖ: జిల్లాలో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. రాంబిల్లిలోని ఓ ఇంట్లో మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,  మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top