మందుగుండు సామాగ్రి పేలి ఒకరు మృతి
విశాఖ: జిల్లాలో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. రాంబిల్లిలోని ఓ ఇంట్లో మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.