కుట్రపై కన్నెర్ర
విభజనతో దగాపడ్డ ఆంధ్రకు ‘హో దా’ర్పు కావాలి. మాటిచ్చిన బీజేపీ నాలుక మడత పెట్టింది. మేము సాధిస్తామని ఎన్నికల్లో కల్లబొల్లి హామీలిచ్చిన టీడీపీ తోక ముడిచింది. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నేనున్నానంటూ ప్రతిపక్ష నేత జగన్ మోహన్రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మహాయజ్ఞం చేపట్టారు. చిన్నారుల నుంచి మూడు కాళ్ల ముదుసలి వరకూ అండగా నిలవగా.. ఆరురోజులపాటు నిరవధిక
నిరాహార దీక్ష కొనసాగించారు.
రోజురోజుకు జననేతకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని ప్రభుత్వం మహాయజ్ఞాన్ని భగ్నం
చేసింది. దీంతో గుండెమండిన రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎక్కడికక్కడే నిరసన గళం విప్పారు. జగన్ ఆరోగ్యం కోసం అందరు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు.