ఐదెకరాల వరి పంట బుగ్గి
చేతికొచ్చిన పంట అగ్నికి కాలి బూడిద కావడంతో ఓ రైతు విలవిలలాడిపోయాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఎరికినాయుడు అనే కౌలు రైతుకు చెందిన ఐదు ఎకరాల వరికుప్ప అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. పంటను కోసి పొలంలోనే కుప్పపోసి ఉంచారు. ఉదయమే నడక కోసం వచ్చిన విద్యార్థులు పొలంలో ఎగసిపడుతున్న మంటలను చూసి అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లతో వచ్చి సిబ్బంది మంటలు చుట్టుపక్కల పొలాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.