పరుపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం


మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ పరుపుల ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ. కోటి మేర ఆస్తినష్టం సంభవించిందని చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top