అగ్నిప్రమాదంలో 14 గుడిసెలు దగ్ధం


కర్నూలు (ఓల్డ్‌ సిటీ) : అగ్నిప్రమాదంలో 14 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన కర్నూలులోని ధర్మాపేట కాలనీలో శనివారం చోటుచేసుకుంది.  షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మంటలు అలుముకున్న సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.అయితే దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top