భార్యను చంపాలని ఇంటికి నిప్పు పెట్టాడు


కంకిపాడు (కృష్ణా): భార్యను హత్య చేసేందుకు ఓ భర్త ఇంటికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఆరు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్నులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి చుట్టు పక్కల ఉన్న మూడు గడ్డి వాములు కూడా దగ్ధమయ్యాయి. సుమారుగా రూ. 10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top