కడపలో భారీ అగ్ని ప్రమాదం
-రూ.4 లక్షల ఆస్తి నష్టం
కడప: కడప పట్టణంలోని ఎన్జీవో కాలనీలోని ఓ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సాయి మహేష్ గ్రాఫిక్స్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే లోపల ఉన్న ఫర్నిచర్, ముడిసరుకు దగ్ధం అయ్యాయి. రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.