ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం


ఓబులవారిపల్లె: వైఎస్సార్ కడప జిల్లా ఓబులవారిపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు ఎగిసిపడటంతో ఆపరేషన్ థియేటర్ పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న రెండు ఆక్సిజన్ సిలిండర్‌లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top