ఏపీ ట్రాన్స్కో సబ్ డివిజన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
విజయవాడ: విజయవాడ గుణదల ఏపీ ట్రాన్స్కో సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. సబ్ స్టేషన్ ఆవరణలోని ఎలక్ర్టికల్ కేబుల్స్కు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ప్రమాదంలో ఖరీదైన కేబుల్స్ అగ్నికి ఆహుతయ్యాయి.
సంబంధిత వార్తలు