జగదాంబ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం
విశాఖపట్నం: నగరంలోని జగదాంబ సెంటర్ లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్థుల భవనంలో మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. నిర్వాహకులు ముందుగా సిబ్బందిని బయటకు పంపించారు.
మరికొంత మంది మంటల్లో చిక్కుకున్నారని ఆందోళన చెందుతున్నారు. రెండో అంతస్థులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.