ఫిబ్రవరిలో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు


హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరిలో గుంటూరు మీదుగా హైదరాబాద్కు ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.



విజయవాడ-సికింద్రాబాద్ మధ్య..

ఫిబ్రవరి 5,12వతేదీల్లో విజయవాడ-సికింద్రాబాద్ ప్రతేక రైలు (నంబరు07207) రాత్రి 11గంటలకు విజయవాడలో బయలుదేరి మంగళగిరి, గుంటూరు, నల్లగొండల మీదుగా సికింద్రాబాద్‌కు మరుసటి రోజు తెల్లవారుజామున 5.40కి సికింద్రాబాద్  చేరుకుంటుంది.



ఫిబ్రవరి 8,15వ తేదీల్లో సికింద్రాబాద్-విజయవాడ ప్రత్యేక రైలు (07208) రాత్రి 11.15కు సికింద్రాబాద్‌లో బయలు దేరి నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా ఉదయం 5.45కి విజయవాడ చేరుకుంటుంది.



కాకినాడ-సికింద్రాబాద్ మధ్య..

ఫిబ్రవరి 6,13వ తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు (07202) రాత్రి 7.15 కు సికింద్రాబాద్లో బయలు దేరి నల్లగొండ,  సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు,తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా మరుసటిరోజు కాకినాడకు చేరుకుంటుంది.



ఫిబ్రవరి 7,14వతేదీల్లో కాకినాడటౌన్-సికింద్రాబాద్ మధ్య  ప్రత్యేక రైలు (07201) సాయంత్రం 6.30 కు కాకినాడలో బయలుదేరి  సామర్లకోట, రాజమండ్రి,తాడేపల్లిగూడెం, ఏలూరు,విజయవాడ, గుంటూరు మీదుగా మరుసటిరోజు ఉదయం 5.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top