రైలు ప్రమాదంలో రైతు మృతి


 పొందూరు : పొందూరు, జి.సిగడాం మండలాల సరిహద్దు రైల్వే ట్రాక్‌పై ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో ఎద్దు మృతి చెందింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతు చిత్తిరి కృష్ణ(50)ను 108లో రిమ్స్‌కు తరలించారు. అక్కడ వాహనం నుంచి దించుతుండగా మృతి చెందాడు. వివరాలు... జి.సిగడాం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన రైతు చిత్తిరి కృష్ణ, అతని భార్య మల్లెమ్మ ఏరు పూసి ఆదివారం ఉదయం కొల్లిపేట రైల్వేట్రాక్ సమీపంలో పొలం దున్నారు.

 

 పొలం దున్నడం పూర్తై తర్వాత భార్యను ఇంటికి పంపించేశాడు. తరువాత ఏరుతో వస్తున్న కృష్ణ కొల్లిపేట వద్ద రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో ఎద్దు అక్కడే మృతి చెందింది. ఏటి కర్ర బలంగా కృష్ణను ఢీకొట్టగా రైలు ట్రాక్ పక్కన ఉన్న పెద్ద రాళ్లపై ఎగిరి పడ్డాడు. దీంతో కృష్ణ తలకు, ఎడమ కాలికి బలమైన గాయూలయ్యూయి. దీంతో 108కు సమాచారం అందించారు. రిమ్స్‌కు తరలించారు. అయితే 108 నుంచి దించిన కొద్ది సేపటికే రైతు కృష్ణ మృతి చెందాడు. కృష్ణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top