పిడుగుపాటుతో రైతు మృతి


ఇచ్చాపురం (శ్రీకాకుళం): పొలంలో పనులు చేసుకుంటున్న రైతుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని కేదారిపురం గ్రామానికి చెందిన పిట్ట చిరంజీవి (45) శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో తన పొలంలో పనులు చేస్తుండగా పెద్ద శబ్దంతో ఆయనపై పిడుగుపడింది. దీంతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇరవయ్యేళ్ల లోపు ఇద్దరుకుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top