పిడుగుపాటుకు రైతు మృతి


శ్రీకాకుళం (సీతంపేట): పిడుగు పాటుతో ఓ వ్యక్తితో పాటు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బామిని మండలంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని సొలికిరి గ్రామానికి చెందిన సింహాద్రి(34) వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండితో పొలానికి వెళుతుండగా పిడగు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పాలకొండ నియోజక వర్గంలో బుధవారం అర్ధరాత్రి నుంచి సీతంపేట, బామిని మండలాల్లోవర్షం కురుస్తుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top