అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


కొయ్యలగూడెం: వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చేదారి కానరాక ఓ రైతు బలవన్మరణం చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి(40) గురువారం రాత్రి పురుగు మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాగు రుణ భారమే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిందని గ్రామస్తులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top