వైఎస్ఆర్ సిపికి కామన్ గుర్తుగా సీలింగ్ ఫ్యాన్

సీలింగ్ ఫ్యాన్ను గుర్తుగా చూపుతున్న వైఎస్ విజయమ్మ(ఫైల్ ఫొటో) - Sakshi


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి)  సీలింగ్ ఫ్యాన్ను కామన్ గుర్తుగా కేటాయించింది. రాష్ట్రంలోని 294 శాసనసభ, 42 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు సీలింగ్ ఫ్యాన్ కామన్ గుర్తుగా ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులు ఆ పార్టీ కార్యాలయానికి అందాయి.



ఈ పార్టీ లోక్సభ, శాసనసభ సభ్యులు గత ఉప ఎన్నికల్లో ఈ గుర్తుపైనే గెలిచారు.  అదే సీలింగ్ ఫ్యాన్ను కేంద్ర ఎన్నికల సంఘం  తమ పార్టీకి కేటాయించడం పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  సీలింగ్ ఫ్యాన్ గుర్తును రాష్ట్రంలో ఎవరికీ  కేటాయించరు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top