కూతుళ్లతో కలిసి బావిలో దూకిన తల్లి
గుంటూరు:జీవితంపై విరక్తి చెందిన ఓ తల్లి తన ఇద్దరి కూతుళ్లతో కలసి బావిలో దూకిన ఘటన గురజాల ప్రభుత్వాస్పత్రిలో కలకలం రేపింది. గురజాల ప్రభుత్వాస్పత్రికి వచ్చిన తల్లీ కూతుళ్లు మంగళవారం ఆకస్మికంగా బావిలోకి దూకారు. ఈ ఘటనలో తల్లి, ఒక కూతురు మృతి చెందగా, మరో కూతుర్ని మాత్రం స్థానికులు రక్షించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.