వ్యాపారులను బెదిరిస్తున్న నకిలీ నక్సలైట్ అరెస్ట్


శ్రీకాకుళం : నక్సలైట్ అని చెప్పుకుని వ్యాపారులను బెదిరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బామినిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఓ వ్యక్తి నక్సలైట్ అని చెప్పి తనకు డబ్బులు ఇవ్వాలని వ్యాపారులను బెదిరిస్తుండేవాడు. అయితే, విషయం తెలుసుకున్న బామిని పోలీసులు ఆ నకిలీ నక్సలైట్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.50 వేల నగదుతో పాటు 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top