యువతిని మోసం చేసి.. ప్రాణాలు తీశాడు!
నల్లజర్ల (పశ్చిమ గోదావరి)
తాను డాక్టర్నని చెప్పి.. ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి, ఆమెకు చేతకాని వైద్యంతో అబార్షన్ చేసి.. చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. ఈ దారుణం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగింది. బుధవారం నాడు ఇది వెలుగులోకి వచ్చింది. రమేశ్ అనే వ్యక్తి తాను డాక్టర్నని చెప్పుకొంటూ నల్లజర్లలో వైద్యం చేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది.
విషయం తెలుసుకున్న రమేశ్ తన ఆస్పత్రిలోనే ఆమెకు అబార్షన్ చేశాడు. చేతకాని వైద్యం చేయడంతో.. ఆమె మరణించింది. నిందితుడిని శిక్షించాలని బాధితురాలి బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.