కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ దాడులు
నూజీవీడు: కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంగళవారం దాడులు చేపట్టింది. 5 బృందాలుగా ఏర్పడిన ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నూజీవీడు, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, బంటుమిల్లిలోని నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సంఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.