జగన్ దీక్షకు మద్దతుగా..

జగన్ దీక్షకు మద్దతుగా.. - Sakshi


కర్నూలు(అర్బన్) :  చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు, రైతులు, మహిళలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో ప్రారంభించిన దీక్షకు శనివారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ అక్కడకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో పాటు నంద్యాల, ఆదోని, మంత్రాలయం, పాణ్యం, కర్నూలు, డోన్, ఆలూరు, కోడుమూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, ఎస్.వి.మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ, ఐజయ్య, భూమా అఖిలప్రియ దీక్షా శిబిరం వద్దకు వెళ్లి వై.ఎస్.జగన్‌కు సంఘీభావం వ్యక్తం చేశారు.



అలాగే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్‌చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, బుడ్డా శేషారెడ్డి, తదితర నాయకులు గత రెండు రోజుల క్రితమే తణుకు చేరుకుని జగన్ దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ డి.వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ నాగరాజుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు దీక్షకు వెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top