అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా

అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా


విజయవాడ: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్యకేసు విచారణను ముంబై కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. 13న తమ ఎదుట హాజరుకావాలని అనూహ్య తండ్రిని కోర్టు ఆదేశించింది. జనవరి 5న కుర్లాలో అదృశ్యమైన అనూహ్య, కంజూర్‌మార్గ్-భాండూప్‌లో శవమై తేలిన సంగతి తెలిసిందే.



ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ చౌక్యా  ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకున్న ముంబై పోలీసులు లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను ఇప్పటికే దాఖలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top