కాకినాడ హార్బర్లో అవినీతిపై విచారణ
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న ఆవినీతిపై విచారణకు ఆదేశించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విచారణ అధికారిగా జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ను నియమిస్తున్నట్లు చెప్పారు. అవినీతికి పాల్పడిన ఎంతటి అధికారినైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఆమె విచారణ జరిపి నివేదిక అందించిన వెంటనే అవినీతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న అవినీతిపై సాక్షి మీడియా పలు కథనాలు వెలువరించింది. దాంతో జిల్లాకు చెందిన మంత్రి యనమలపై విధంగా స్పందించారు.