ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi


కావలి : నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో భారతి అనే విద్యార్థిని శుక్రవారం అర్థరాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్యాయత్నం చేసింది. తలకు వేసుకునే రంగును సేవించి ఆమె ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కాలేజీ యాజమాన్యం ఆమెను నెల్లూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భారతి మృతి చెందింది. మృతురాలి స్వస్థలం ఉదయగిరి మండలం కొండారెడ్డిపాలెం.  కాగా భారతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top