గర్భిణిపై కానిస్టేబుల్ అత్యాచారం !
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. నగరంలోని గంగానమ్మ సెంటర్లోని వ్యభిచార ముఠాను టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అయితే వారిని విచారిస్తున్న క్రమంలో ఓ కానిస్టేబుల్ గర్భిణిగా ఉన్న వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
బాధితురాలు కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యదు చేసింది. దాంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. అనంతరం ఈ ఘటనపై విచారణకు పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.