అటవీ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగులు


చిత్తూరు:  చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ అటవీ ఉద్యోగిని తొక్కి చంపాయి. రామకుప్పం మండలం ననియాల గ్రామంలో అటవీశాఖ ఉద్యోగి మునియప్పపై ఏనుగులు దాడి చేశాయి. మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు.



ఈ మండలంలోని పంటపొలాలపై ఏనుగులు తరచూ దాడులు చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. లక్షల రూపాయల విలువైన పంటలు ధ్వంసం చేశాయి. ఈ రోజు చేసిన దాడిలో అటవీ ఉద్యోగి దుర్మరణం చెందారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top