చిత్తూరులో ఏనుగుల బీభత్సం


చిత్తూరు: గజరాజులు రోజురోజుకీ బీభత్సం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి నుంచి ఏనుగులు పంటలపై దాడి చేశాయి. టమాట, చెరుకు తోటలపై దాడి చేసి సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం కలిగించాయి. దీంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడాలని వారు కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top