షాపింగ్మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి
పాతగుంటూరు(గుంటూరు): విద్యుత్ షాక్కు గురై యువకుడు దుర్మరణం చెందగా, మరొకరు గాయాలపాల య్యారు. గుంటూరులోని లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభ కార్యక్రమంలో ఈ విషాదం నెలకొంది. శనివారం సాయం త్రం 6.30 గంటలకు షోరూమ్ ప్రారంభ సమయం కావడంతో నిర్వాహకుల ఒత్తిడి మేరకు ఫ్లెక్సీల ఏర్పాటులో జరిగిన తొందరపాటు కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
షోరూం ఆవరణలోని 12 అడుగుల ఐరన్ ఫ్లెక్సీని ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించే క్రమంలో ఆ ఫ్లెక్సీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో మంటలు చెలరేగి షోరూంలో వాచ్మెన్గా పనిచేస్తున్న పిడుగురాళ్లకు చెందిన చిలుకల విజయ్(18) దుర్మరణం చెందాడు. అదే షోరూంలో అసిస్టెంట్ సేల్స్మెన్గా పనిచేస్తున్న షేక్ జాన్సైదా(22)కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.