పెన్షన్ కోసం తొక్కిసలాట.. వృద్ధురాలి మృతి

పెన్షన్ కోసం తొక్కిసలాట.. వృద్ధురాలి మృతి - Sakshi


హైదరాబాద్: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి..



చిట్టినగర్లో పెన్షన్ తీసుకునేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచే వృద్ధులు వేచియున్నారు. గేటు తీయడంతో వారు ఒక్కసారిగా లోపలి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతో కొందరు కిందపడిపోయారు. కాంతమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. తొక్కిసలాటలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు పెన్షన్ తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. రోడ్డుపై వృద్ధురాలి మృతదేహంతో స్థానికులు బైఠాయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top