నేడు ఎడ్‌సెట్


గుంటూరు ఎడ్యుకేషన్ :బీఈడీ కోర్సు ప్రవేశ పరీక్ష ఏపీ ఎడ్‌సెట్-2015 గురువారం జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష జరగనుండగా నిముషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని నిర్వాహకులు ప్రకటించారు.

 

 దూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు కనీసం గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిది. గుంటూరులోని మూడు పరీక్షా కేంద్రాల పరిధిలో 1,623 మంది, తెనాలిలోని ఏఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో 252 మంది, బాపట్లలోని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో 115 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top