హాస్టల్లో ఉంటున్నారా! అయితే ఇక పండుగే!

రావెల కిషోర్ బాబు


హైదరాబాద్: ఏపి ప్రభుత్వం ప్రకటించిన విధానాలతో హాస్టల్ విద్యార్థులకు ఇక పండుగే. ఈ-హాస్టల్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. హాస్టల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు, అవినీతిని పారదోలతామన్నారు. తొలి విడత 998 ఎస్సి హాస్టల్స్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు.



ఈ విధానం ప్రకారం ప్రతి హాస్టల్లో లాప్టాప్, వెబ్ కెమెరా, బయోమెట్రిక్ మిషన్, సరుకుల వినియోగం, విద్యార్థులు-సిబ్బంది హాజరు...అన్ని వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. హాస్టల్స్లో అవినీతి నిరోధానికి చర్యలు తీసుకుంటామని మంత్రి రావెల తెలిపారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top