అయ్యన్నను నిలదీసిన మహిళలు
డ్వాక్రా రుణాలను మాఫీ ఎప్పుడు...?
కె.కోటపాడు : డ్వాక్రా రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారంటూ మంత్రి అయ్యన్నను డ్వాక్రా మహిళలు నిలదీశారు. ఆనందపురం సభలో వి.సంతపాలెం గ్రామానికి చెందిన మహిళలు సభావేదికపై ఉన్న మంత్రి అయ్యన్నను ప్రశ్నిం చారు. రైతుల రుణమాఫీతో పాటు డ్వాక్రా రుణాలను తక్షణం మాఫీచేయాలని గ్రామానికి చెందిన బోని ఎర్రయ్యమ్మ, అచ్చియ్యమ్మ, లాలం సన్యాసమ్మ, పైడితల్లమ్మలు కోరారు.
ఎన్నికల్లో హామీ మేరకు రుణాలు చెల్లించకపోవడంతో అవి బ్యాంకుల్లో వడ్డీతో సహా కొండలా పెరిగిపోతున్నాయన్నారు. ఇందుకు అయ్యన్న స్పందిస్తూ ఎన్నికల హామీలను ఆర్థిక పరమైన ఇబ్బందుల దృష్ట్యా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. డ్వాక్రా రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు.