డ్రంకన్ డ్రైవ్లో 40మందిపై కేసు నమోదు
ఏలూరు: రోడ్డుప్రమాదాలను నివారించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. రాత్రిపూట మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు జాతీయ రహదారిపై కలపర్రు టోల్ గేటు వద్ద ట్రాఫిక్ పోలీసులు గురువారం డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 40మందిపై డ్రంకన్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు.
సంబంధిత వార్తలు