ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. డ్రైవర్ మృతి


తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌రోడ్డులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు కండక్టర్ సహా ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ బస్సు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు వెళుతోంది. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కండక్టర్ పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top