డాక్టర్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్


బోగోలు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన కారణంగా ఓ డాక్టర్ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..  నెల్లూరు జిల్లా బోగోలు మండలం దళితవాడకు చెందిన ఓ చిన్నారి విషజ్వరం బారిన పడి బుధవారం మృతిచెందింది. విష జ్వరంతో చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. జానకి గురువారం పరామర్శించారు.



దళితవాడలో విషజ్వరాలు ప్రబలుతున్నాయనే సమాచారంతో కలెక్టర్ ఈ రోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పీహెచ్‌సీలో డాక్టర్‌గా పనిచేస్తున్న కరుణాకర్ విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే విషయాన్ని గుర్తించిన కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top