సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు

సినీ దర్శకుడు గుణశేఖర్‌పై చెక్‌బౌన్స్ కేసు


సాక్షి, హైదరాబాద్: రుద్రమదేవి సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్‌పై సినీనటుడు సుమన్ చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సుమన్ గురువారం నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. రుద్రమదేవి సినిమాలో నటించినందుకు ప్రతిఫలం (రెమ్యూనరేషన్)లో భాగంగా గుణశేఖర్ రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారని, ఆయన బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయిందని సుమన్ పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరినా గుణశేఖర్ స్పందించకపోవడంతో.. కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top