పగిడిరాయిలో వజ్రాలు


కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో సోమవారం స్థానికులకు రెండు వజ్రాలు  లభించాయి. వాటిని పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతంలో వజ్రాలు లభిస్తాయని స్థానికుల నమ్మకం. వజ్రాల కోసం స్థానికులు వెతకటం సర్వ సాధారణం. కాగా.. వజ్రాలకు సంబంధించి సమాచారం కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top