తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శానానికి పది గంటల సమయం పడుతుండగా, నడక దారి భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.  మరోవైపు రూ.100, రూ.500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు.



శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు అందిన సమచారం ప్రకారం



ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం -165 ఖాళీగా ఉన్నాయి

సహస్ర దీపాలంకరణ సేవ - 78 ఖాళీగా ఉన్నాయి.

వసంతోత్సవం - 109 ఖాళీగా ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top