అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం


విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముంబైకి పశ్చిమనైరుతి దిశగా 1135 కిలోమీటర్ల దూరంలో ఆ వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి కనిష్ట ఉష్టోగ్రతలు తగ్గి చలి పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం పేర్కొంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top