విద్యార్థిని ప్రాణం తీసిన ఈవ్ టీజింగ్
ఏలూరు: ఈవ్ టీజింగ్ ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. ప్రేమ పేరుతో పెట్టిన వేధింపులు తట్టుకోలేక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. సత్రంపాడు నెహ్రూ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికలంగా సంచలనం రేపింది.
ముగ్గురు యువకులు ఆమెను వేధిస్తుడడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. మృతురాలు సీఆర్ రెడ్డి కాలేజీలో చదువుతోంది. ఆమె తండ్రి కూడా అదే కాలేజీలో పనిచేస్తున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.