ఓటమితోనే విజయానికి బాటలు

ఓటమితోనే విజయానికి బాటలు


ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి

 

జమ్మలమడుగు: క్రీడల్లో ఓటమితోనే విజయానికి బాటలు వేసుకోవచ్చని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి జరిగిన తప్పులు తిరిగి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గెలుపు సునాయాసమవుతుందని చెప్పారు. సోమవారం ఆర్టీసీ యూత్, సింగిల్‌విండో డెరైక్టర్ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రొద్దుటూరు, దేవగుడి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఆయన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు.



ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ప్రొద్దుటూరు జట్టుకు ట్రోఫీ, నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యత మరే క్రీడకు లేదన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి క్రీడాకారుడు గెలుపు కోసమే ప్రయత్నించాలన్నారు. కలిసికట్టుగా ,బాధ్యతాయుతంగా ఆడిన జట్టుకే విజయం లభిస్తుందని చెప్పారు.

 

హోరాహోరీగా సాగిన మ్యాచ్...


ప్రొద్దుటూరు కల్యాణ్ లెవన్, దేవగుడి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా కొనసాగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ప్రొద్దుటూరు జట్టు 16 ఓవర్లలో 147 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్ ప్రారంభించిన దేవగుడి జట్టు 16 ఓవర్లలో 120 పరుగులు సాధించింది. దీంతో విన్నర్‌గా నిలిచిన కల్యాణ్ జట్టుకు రూ.20వేలు ట్రోఫీ, రెండవ స్థానంలో నిలిచిన దేవగుడి జట్టుకు రూ.10వేలు ట్రోఫీ, మూడో స్థానంలో నిలిచిన వెంకటేశ్వర జట్టుకు రూ.5వేలు ట్రోఫీని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాతిరెడ్డిసూర్యనారాయణరెడ్డి, రోటరీక్లబ్ అధ్యక్షుడు జనార్ధన్‌శెట్టి, హృషికేశవరెడ్డిలు అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top