ఎస్వీయూ దూరవిద్య అడ్మిషన్ల గడువు పెంపు


తిరుపతి: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు డీడీఈ (డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడుకేషన్) డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. వివిధ స్టడీ సెంటర్ల కో-ఆర్డినేటర్ల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆసక్తి గలవారు దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. అసైన్‌మెంట్ మార్కులు పొందని విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించి తిరిగి అసైన్‌మెంట్లు సమర్పించాలని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top