రూ.100 కోట్లు కాదు రూ. 800 కోట్లు ఇచ్చింది'

'రూ.100 కోట్లు కాదు రూ. 800 కోట్లు ఇచ్చింది' - Sakshi


కడప: పోలవరం ప్రాజెక్ట్కు మోదీ ప్రభుత్వం కేవలం రూ. 100 కోట్లే ఇచ్చారని దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి మండిపడ్డారు. బుధవారం కడపలో నిర్వహించిన జన కల్యాణ్ పర్వ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. పోలవరానికి కేంద్రం రూ. 100 కోట్లు కాదని రూ. 800 కోట్లు మంజూరు చేసిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఏపీ రాజధానికి కేంద్రం రూ. 8 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకు తమ పార్టీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మంగళవారం  ఏడాది పూర్తయింది. ఏడాది పూర్తయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top