ప్రభుత్వాస్పత్రిలో రిమాండ్ ఖైదీ మృతి
శ్రీకాకుళం: పాతపట్నం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న ఖైదీ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అతడు మరణించాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వాస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానిక ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.